టాలీవుడ్ లో ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అనగానే జనాలకు ముందు నుంచి కూడా ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే ఆయన మాత్రం తనకు వచ్చిన క్రేజ్ ని కాపాడుకోలేదు అనే విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే సినిమాలను చేస్తున్నారు. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో ఆయనకు మళ్ళీ క్రేజ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది అని అంటున్నారు. అందుకే ఆయన చిరంజీవి ని కుడా లైన్ లో పెట్టారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిరంజీవి తో ఆయన సినిమా చేసే విషయం త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పూరి ఒక కథను చిరంజీవి కోసం సిద్దం చేసుకుని ఉంచారని లాక్ డౌన్ లో ఆ కథను పూరి రాసుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏ కథ తో సినిమా చేస్తాడో చూడాలి. 

 

చిరంజీవి ఇప్పుడు ఆ కథను కూడా విన్నారు అని అంటున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు అని సమాచారం. కథ ఆయనకు బాగా నచ్చింది అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది పూరి ని ఇటీవల తన ఇంటికి కూడా చిరంజీవి పిలిచారని కొన్ని మార్పులు కూడా అడిగారు అని సమాచారం. మరి సినిమా చేస్తారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: