వరసగా 6 డిజాస్టర్ల తరువాత గత ఏడాది  చిత్రలహరి , ప్రతి రోజు పండగే సినిమాలతో సూపర్ హిట్లు కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ హీరో సోలో బ్రతుకే సో బెటర్ లో నటిస్తున్నాడు. మే1న విడుదలకావల్సిన ఈచిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. అయితే ఈసినిమా ఎప్పుడు విడుదలైనా సూపర్ సక్సెస్ అవుతుందని సాయి ధరమ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ముఖ్యంగా సినిమాలో కామెడీ తోపాటు సాంగ్స్ హైలెట్ అవుతాయని అలాగే ప్రతి తల్లి ఈసినిమా కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నాడు.    
 
తాజాగా విడుదలైన ఈసినిమాలోని మొదటి సాంగ్ నో పెళ్లి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో తెరక్కుతున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్  బ్యూటీ  నాభ నటేష్  హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సెప్టెంబర్ లో ఈచిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇక ఈసినిమా తరువాత సాయి ధరమ్ తేజ్, ప్రస్థానం ఫేమ్ దేవకట్టా తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈసినిమా లాంచ్ అయ్యింది. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ కు జోడిగా నివేత పేతురాజ్ నటించనుంది. మణిశర్మ సంగీతం అందించనున్నాడు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకం పైభగవాన్ ,పుల్లారావు నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకు రానుంది. జులై లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: