ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భూములు కొనే విషయంలో కొందరు సినీ ప్రముఖులు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాలలో ఒకటిగా ఉంటుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ నగరాన్ని రాజధానిగా ఎప్పుడు అయితే ప్రకటించారో అప్పటి నుంచి పలువురు విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో భూములు కొనడానికి గానూ కొందరు సినీ ప్రముఖులు ఏపీ అధికార పార్టీ నేతలను అడిగారు అని వార్తలు వచ్చాయి. నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం పెద్ద చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో విశాఖ వెళ్లి భూములు కొనడానికి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ట్రై చేస్తుందని అంటున్నారు. తనతో సినిమా చేసిన ఒక హీరో ద్వారా ఆమె ఈ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఏపీకి చెందిన ఒక మంత్రి గారికి సదరు హీరో చాలా సన్నిహిత వ్యక్తి అని... అతని ద్వారా విశాఖ లో బిజినెస్ ప్లాన్స్తో ముందుకు వెళ్ళే విధంగా ఆమె అడుగులు వేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమె రిషి కొండ ప్రాంతంలో రెండు ఎకరాలు కొనాలని చూస్తున్నట్టు సమాచారం.
త్వరలోనే ఆమె విశాఖ కూడా వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏపీలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని అందుకే ఆమె ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఆమెకు ఇప్పటికే కొందరి నుంచి మంచి సలహాలు వచ్చాయని అందుకే ఆమె ఇప్పుడే జాగ్రత్తలు పడితే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి కొంతుందా లేదా అనేది చూడాలి. ఇక విశాఖ లో టాలీవుడ్ వాళ్లు పెట్టుబడులు జోరందు కోవడం ఇప్పుడే కాదు.. ఇది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువుగానే ఉంది.