టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత‌లా క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే చాలు తెలుగు సినిమా అభిమానుల‌కు ఓ దీపావ‌ళి, ఓ సంక్రాంతియే అన్నంత హంగామా న‌డుస్తుంది. ఆయ‌య‌న అభిమానులు అర్ధ‌రాత్రి నుంచే ప‌నులు మానుకుని థియేట‌ర్ల ద‌గ్గ‌ర డ్యాన్సులు చేస్తూ ఫ‌స్ట్ షో ఎప్పుడు ప‌డుతుందా ? అని  ఎదురు చూసిన సందర్భాలు కామ‌న్‌. ఇక ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.



ఈ రెండు మూడు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో ప్ర‌శాంత్ నీల్ ఒక్క సారిగా నేష‌న‌ల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయాడు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. తాను మరో రెండేళ్ళు మాత్రమే సినిమా చేస్తా అని తాను ఎక్కువ కాలం సినిమాలు చేసే అవకాశం లేదని ఆయన చెప్పారట. తాను వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలని 2022 వరకు మాత్రమే చేస్తా అని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం. తనకు అడ్వాన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్లకు కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.



ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తోన్న వకీల్ సాబ్ షూటింగ్ త్వ‌ర‌లోనే ఫినిష్ కానుంది. ప్రస్తుత౦ పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇదే విష‌యాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ తో కూడా చెప్పాడు అని తనతో సినిమా పూర్తి చేసుకుంటే మంచిది అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం క్రిష్ పవన్ తో సినిమాను మొదలుపెట్టారు కూడా.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: