దక్షిణాది సినిమాలకి ఉత్తరాదిన గిరాకీ బాగా పెరిగింది. ఒకప్పుడు మన సినిమాలని అంతగా పట్టించుకోని ఉత్తరాది నిర్మాతలు, ప్రస్తుతం మన సినిమాల రీమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నారు. ఇక్కడి సినిమాల హిందీ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ రావడం కూడా నిర్మాతలని రీమేక్ రైట్స్ కొనేలా చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల సూపర్ హిట్ చిత్రాల రీమేక్ రైట్స్ దక్కించుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు.

 

ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలు బాలీవుడ్ కి వెళ్లాయి. ఎన్నో మంచి మంచి విజయాలని కూడా అందుకున్నాయి. తాజాగా మరో దక్షిణాది చిత్రం బాలీవుడ్ కి వెళ్లనుంది. మళయాలంలో సూపర్ హిట్ అందుకున్న అయ్యప్పనుం కోషియం అనే చిత్రం బాలీవుడ్ కి వెళ్లనుంది. పృథ్వీరాజ్, బిజు మీనన నటించిన ఈ చిత్రం మళయాలం లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యాక్షన్, థ్రిల్లర్ కలగలిపిన అంశాలతో కూడిన ఈ చిత్ర హిందీ రీమేక్ రైట్స్ ని ప్రముఖ హీరో జాన్ అబ్రహమ్ దక్కించుకున్నాడు.

 

ఈ సినిమాని చూసిన జాన్ అబ్రహమ్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడట. యాక్షన్ తో పాటు థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ఆసక్తిగా ఉందని తెలిపాడు. అందుకే ఇలాంటి సినిమాని హిందీ ఆడియన్స్ కి చూపించడానికి తానే రీమేక్ హక్కులని కొనుక్కున్నట్లు వెల్లడించాడు. తన నిర్మాణ సంస్థ అయిన జేఏ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ రీమేక్ తెరకెక్కనుంది. హీరో, డైరెక్టర్ ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు ఎవరనేది వెల్లడి చేయలేదు.

 

ఇక్కడ విశేషం ఏమిటంటే అయ్యప్పనుం కోషియం అనే చిత్రం తెలుగులోనూ రీమేక్ కానుంది. హారికా హసినీ క్రియేషన్స్ బ్యానర్ లో భాగమైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ తెలుగు రీమేక్ ని తెరకెక్కించే దర్శకుడి కోసం వెతుకుతోంది. అర్జున్ రెడ్డితో బ్లాక్  బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి పేరుని పరిశీలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: