రెండేళ్ల గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,వకీల్ సాబ్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఈసినిమా ప్రారంభం కాగా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అయితే ఇంతలో కరోనా వల్ల లాక్ డౌన్ అమలులోకి రావడంతో  షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక జూన్ నుండి  అతి తక్కువ మంది  తో షూటింగ్ ను జరుపుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడం తో జూన్ నుండి  వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. మరో  30రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా తదుపరి షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగనుంది. ఈషెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కానున్నాడని నిర్మాత దిల్ రాజు తెలిపాడు.
 
ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ,మొదటి సాంగ్ మగువ మగువ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుందట అయితే ఈ విషయం లో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. 
 
ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తో  పాటు పవన్ కళ్యాణ్,ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27వ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇవే గాక హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్  రెండో సారి నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: