అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించి మెప్పించిన సినిమా మనం. ఏయన్నార్ నటించిన చివరి సినిమా కూడా అదే. అందుకే నాగార్జునసినిమా సూపర్ హిట్ అయినా కూడా రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. మనం తర్వాత అలాంటి మల్టీస్టారర్ సినిమా కోసం మిగతా సినీ నేపథ్యం ఉన్న హీరోలు ప్రయత్నించారు. కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే వచ్చే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. 

 

బాబాయ్, అబ్బాయ్ మల్టీస్టారర్ కు సై అంటున్నా వాళ్ళిద్దరికీ సరిపడే కథ దొరకడం లేదని తెలుస్తుంది. నందమూరి మనం కోసం మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. లేటెస్ట్ గా ఈ మల్టీస్టారర్ కథ సెట్ అయ్యిందని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో బాలయ్య, ఎన్టీఆర్ కలిసి ఈ మల్టీస్టారర్ లో నటిస్తారని అంటున్నారు. అయితే ఏ సినిమా కథ ఏంటి డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బి.గోపాల్ డైరక్షన్ లో మూవీ ఉంటుందని టాక్. ఆ అర్వాత అనీల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమాకు రెడీ అంటున్నాడు. 

 

ఈలోగానే నందమూరి మల్టీస్టారర్ చేస్తారని తెలుస్తుంది. తారక్ కూడా ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి నందమూరి మల్టీస్టారర్ సినిమా చేశాక త్రివిక్రమ్ సినిమా చేస్తాడా లేక ముందుగానే త్రివిక్రమ్ సినిమా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి కళ్యాణ్ రామ్ కృషితో నందమూరి మనం చూడబోతున్నారట ప్రేక్షకులు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: