మన తెలుగులో సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ కాలంలో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఆమె సినిమాలు అన్నీ కూడా తెలుగులో హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం వరుసగా సినిమాలను చేయలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకులక ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఇక రానా తో ఒక సినిమా నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తుంది ఆమె. ఈ రెండు సినిమాలు ఏ విధంగా ఉంటాయో గాని సాయి పల్లవి ఉండటం తో ఈ రెండు సినిమాలను మలయాళ౦ లో కొనడానికి ఒక నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె సినిమాలు అంటే అక్కడ ప్రత్యేక అభిమానం తో చూస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు అక్కడ ఆమె సినిమాలను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మలయాళం లో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఆమె ఫుల్ బిజీ అయిపోయే సూచనలు ఉన్నాయి. 

 

ఇక ఇది పక్కన పెడితే రానా తో ఆమె చేసిన సినిమాలో ఆమె పాత్రకు భారీగా డిమాండ్ చేసినా సరే ఒప్పుకున్నారట. దానికి కారణం ఆమె అవసరం ఉండటమే అని సమాచారం. ప్రస్తుతం ఆమె నా చైతన్య తో చేస్తున్న సినిమా ట్రైలర్ కూడా వచ్చింది. ఆ సినిమాలో తెలంగాణా అమ్మాయిగా ఆమె నటిస్తుంది. మరి ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుంది ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: