నేటి ఉదయం నుంచి టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుపై పోలీస్ కేస్ నమోదు అయిందని, ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్యామ్ మోసం చేశారని ఒక నటి హైదరాబాద్ లోని SR నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఇకపోతే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్ ను అదుపులోకి తీసుకున్నారని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ కేసు పెట్టిన పేరు మీకు తెలుసా...? 


అసలు ఈ కేసు పెట్టిన నటి పేరు సాయి సుధా రెడ్డి. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ తో తనకు ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉందని 2015 నుంచి తనతో సహజీవనం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట్లో తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, అందుకు సంబంధించిన వాయిస్ రికార్డ్స్, చాటింగ్ టెక్స్ట్ ఇలా తన దగ్గర ఉన్న ఆధారాలను సాయి సుధా మీడియాకు వెల్లడించారు. ఇక వారి విషయం శ్యాం ఇంట్లో కూడా తెలుసునని ఆమె తెలిపారు. అయితే శ్యామ్ అన్నయ్య ప్రముఖ సినీ ఆటో గ్రాఫర్ అయిన చోట కే నాయుడు తనకి పెళ్లి చేస్తానని చెప్పారని, కానీ ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులు వారిని ఆగమని చెప్పాడని సుధా రెడ్డి వివరించారు.


ఇకపోతే ప్రస్తుతం మా పెళ్లి గురించి అడిగితే శ్యామ్ కే నాయుడు స్పందించలేదని, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అంటున్నారని ఆవిడ తెలిపింది. అయితే ఈ సాయి సుధ ఎవరన్న విషయానికి వస్తే... ఇప్పటివరకు 45 సినిమాల్లో నటించారు. కాకపోతే ఆమెకు ఇంకా సరైన గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. గుంటూరు నగరానికి చెందిన సాయి సుధా ఫిజియోథెరపీ కోర్సు కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఇలా తన కోర్సును పూర్తిచేసి ఉద్యోగంలో చేరారు ఆవిడ. అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె దృష్టి కాస్త సినిమాల వైపు నడిచింది. ఇక ఇదే తరుణంలో 2012 సంవత్సరంలో వచ్చిన బాడీగార్డ్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. నిజానికి ఆమె మొదట " దమ్ము " లో నటించిన చివరికి దమ్ము చిత్రం బాడీ గార్డ్ చిత్రం తర్వాత రిలీజ్ అవ్వడంతో బాడీగార్డు సినిమా ఆమెకు మొదటిది అయ్యింది. ఇక అలాగే రవి బాబు నిర్మించిన అవును సినిమాలో కూడా ఒక పనిమనిషి క్యారెక్టర్ గా నటించింది సాయి సుధ. ఇక ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ అర్జున్ రెడ్డి, ఎవరు సినిమాల్లోనూ ఈవిడ పాత్రలు పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: