సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా డైరెక్టర్ పరశురాంతో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి  ఈ నెల 31న సూపర్ స్టార్  క్రిష్ణ బర్త్ డే సందర్భంగా ముహూర్తం షాట్ తీస్తారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ అన్నది తరువాత  ఉంటుంది.

 

ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి సర్కార్ వారి పాట అని ఇంటెరెస్టింగ్ టైటిల్ ని పరశురాం కంఫర్మ్ చేశారని అంటున్నారు. ఈ టైటిల్ వినగానే అనేక రకాల కధనాలు మనసుకు తడతాయి. వేలం పాట ముందు వచ్చే మాట ఇది. మరి ఆ వేలం ఎవరిది, రాజకీయ వేలమా. భూముల కధా, సర్కార్ వారి వేలం పాట అంటున్నారు. అంటే కచ్చితంగా రాజకీయాలు ఉంటాయా.

 

ఇవన్నీ ఆసక్తిగా చర్చించుకోవాల్సిన విషయాలే. ఈ మూవీని కంప్లీట్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిక్స్ చేసి ఆడియన్స్ ఫుల్ మీల్స్ గా డైరెక్టర్ పరశురాం డిజైన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కైరా అద్వానీని తీసుకుంటారని తెలుస్తోంది.

 

ఈ అమ్మడు  మహేష్ బాబు తో  కలసి భరత్ అను నేను మూవీ చేసింది.  అది సూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జూలై లో కానీ, ఆగస్టులో కానీ మొదలెట్టి 2021 సమ్మర్ కి సినిమా హాళ్ళకు తీసుకువద్దామని ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. మొత్తానికి సర్కార్ వారి పాట టైటిల్ మంచి క్యాచీగానే ఉంది.

 

మూవీ మహేష్ బాబు 27వ సినిమాగా వస్తోంది. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాదు, ఈ సినిమా పరశురాం కాంబోతో రావడంతో కూడా ఫ్యాన్స్ కి హుషార్ పెరుగుతోంది. మరి అందరి అంచనాలు పరశురాం అందుకుంటాడని ఆశిద్ద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: