ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫాం లో ఉన్న హీరోయిన్ కన్నడ బ్యూటి రష్మిక మందన్న. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' తో 2020 ప్రారంభంలోనే భారీ హిట్ ని అందుకుంది. తర్వాత యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ తోనూ మంచి సక్సస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప' హీరోయిన్ గా నటిస్తోంది.  అయిదు భాషల్లో రిలీజ్ అయ్యో ఈ సినిమాతో రష్మిక క్రేజ్ విపరీతంగా పెరుగుతుందని భావిస్తోంది.

 

ఇక రష్మిక ఇప్పుడు ఓ తమిళ సినిమా కూడా చేస్తోంది. కార్తి హీరోగా 'సుల్తాన్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాలలో రష్మిక ఓ క్రీడాకారిణిగా నటిస్తోందని సమాచారం. అథ్లెట్ క్యారెక్టర్ లో రష్మిక కనిపిస్తుందని కోలీవుడ్ మీడియా సమాచారం. ఇప్పటికే క్రీడాకారిణిగా నటింంచిన రష్మిక మరోసారి అదే పాత్ర పోషిస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' లో రష్మిక ఓ క్రికెటర్ గా నటించింది. అయితే ఆ సినిమా ఫ్లాపవడంతో రష్మిక క్యారెక్టర్ అంతగా పాపులర్ అవలేదు. 

 

ఇక ఈ సినిమా రష్మిక మందన్నకు కోలీవుడ్ లో మొదటి సినిమా కావడం  విశేషం. తమిళ స్టార్ హీరో కార్తి నటించిన సినిమాలన్నీ తెలుగులోను డబ్ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా..డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. అయితే రష్మిక క్రికెటర్ గా నటించిన 'డియర్ కామ్రేడ్' ఫ్లాపయింది ...మరి తమిళంలో హిట్ అవుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: