సినిమా ఇండస్ట్రీపై కరోనా ప్రభావం అంతా ఇంతా అని చెప్పలేం. ఆ మహమ్మారి నటీనటుల రెమ్యునరేషన్ తగ్గించేసింది. కథలో మార్పులు తీసుకొచ్చింది. వీటన్నింటికీ మించి హీరో హీరోయిన్ల మధ్య దూరం కూడా పెంచేసింది. గతంలో మాదిరి ముద్దులు ముచ్చట్లు ఉండవు. రొమాంటిక్ సీన్స్ కు లాక్ డౌన్ విధించింది. 

 

కరోనా అందరినీ భయపెడితే.. హీరోయిన్లను కాస్త ఎక్కువ భయపెట్టింది. షూటింగ్స్ మొదలైనా.. వెంటనే సెట్స్ పైకి వెళ్లడానికి హీరోలకు డేర్ చాలడం లేదు. ఫారిన్ నేపథ్యంలో రాసుకున్న కథలను మళ్లీ రిటైర్ చేసి.. ఫారిన్ లేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇదిలా ఉంటే.. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా మారుస్తున్నారు. ఆల్ రెడీ కొందరు హీరోయిన్స్ అయితే.. లిప్ లాక్ ఉందని.. సినిమాలు కూడా వదిలేశారు. 

 

కరోనా ఎఫెక్ట్ రొమాంటిక్ స్టోరీస్ పై పడింది. లిప్ కిస్ లకు.. శృంగార సన్నివేశాలకు దూరమని ముందే చెప్పేస్తున్నారు. గ్లామర్ గా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. బెడ్ రూమ్ సీన్స్ కు మాత్రం నో చెప్పేసింది లావణ్య త్రిపాఠి.

 

బాలీవుడ్ హిట్ మూవీ అందుదాన్ రీమేక్ లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమా కోసం మొదట కీర్తి సురేష్ ను సంప్రదించగా రీమేక్ వలన నో చెప్పడంతో ప్రియాంక మోహన్ ను సంప్రదించారు. ఆమె కూడా ఆసక్తి చూపలేదట. సినిమాలో ముద్దు సీన్స్ ఉండటం కారణంగా వీరిద్దరూ ఈ సినిమాకు నో చెప్పారట.  

 

అందుదాన్ లో ఆయుష్మాన్ ఖురాన్, రాధికా ఆప్టేల మధ్య రొమాంటిక్ సీన్స్ తో పాటు లిప్ కిస్ లు ఉన్నాయి. ఆ సీన్స్ కారణంగానే కీర్తి సురేష్, ప్రియాంక మోహన్రీమేక్ కు నో చెప్పారట. హీరోయిన్సే కాదు, హీరో కూడా.. రొమాంటిక్ సీన్స్ కు దండం పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కథలను మార్చి రాసుకుంటున్నారు దర్శకులు. కరోనా మహమ్మారి కనుమరుగైపోయే వరకు.. హీరోహీరోయిన్ల మధ్య దూరం తప్పదు. ఇప్పట్లో రొమాంటిక్ జానర్ కనిపించకపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: