ఈ మద్య టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది.  కొత్త దర్శకులు, కొత్త హీరో, హీరోయిన్లు వెండి తెరకు పరిచయం అవుతున్నారు. అయితే కొంత మంది అదృష్టం బాగానే కలిసి వస్తుంది.  తెలుగు లోఒక్క సినిమాతో స్టార్ హీదా తెచ్చుకున్న వారిలో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మరికొంత మంది ఉన్నారు.  లక్కు బాగుండి దర్శకులు కూడా మంచి సక్సెస్ సాధిస్తున్నారు.  తాజాగా టాలీవుడ్ మరో కొత్త హీరో  పరిచయం కాబోతున్నారు. ‘లాస్ట్ పెగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్ర యాక్షన్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ చిత్రం. ఈ మూవీ మనిషి జీవితంలో జరిగే కాలానికి సంబంధించినది. ఈ మూవీ ఫుల్ లెన్త్ యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది.

 

యువతీ యువకుడు ప్రేమలో పడితే చివరికి తల్లిదండ్రులు చూపించిన అబ్బాయితో ఆ అమ్మాయి నిచ్చితార్థం అవుతుంది. ఆ క్షణం లో ప్రేమికుడు పడే ఆవేదన ఎలా ఉంటుంది? కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మాజీ ప్రేమికుడు, మరియు నిచ్చితార్థం చేసుకున్న అబ్బాయి కలుస్తారు, ఇదంతా విధి ఆడిస్తున్న నాటకమని వారు భావిస్తారు. చివరికి ఏం జరిగింది ? ఆ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకుంటారు అనే అంశాలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి.

 

 ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయని అంటున్నారు చిత్ర యూనిట్. రెక్టర్ సంజయ్ మాట్లాడుతూ... తాజాగా యాక్షన్ టీజర్ ను విడుదల చేశాము త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ను విడుదల చేయబోతున్నాము, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: