టాలీవుడ్లో సరికొత్త వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పెద్దలు కొందరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ ఈ సమావేశం తనకు తెలియదని.. తనను ఎవ్వరూ పిలవలేదని చెప్పారు. అలాగే ఇది సినిమాల కోసం మీటింగ్ కాదని.. వీళ్లంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూములు పంచుకునేందుకు సమావేశం అయ్యారని ఫైర్ అయ్యారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ బిజినెస్ అని కూడా బాలయ్య అన్న వ్యాఖ్యల వీడియోలు వైరల్ అయ్యాయి.
బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తన యూట్యూబ్ చానెల్ వేదికగా తప్పు పట్టారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకో అంటూ కౌంటర్ వేసాడు. బాలయ్య కేవలం సినిమా ఇండస్ట్రీనే కాదు... తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమాన పరిచేలా మాట్లాడారు. వెంటనే వారిద్దరికి క్షమాపణ చెప్పాలని కూడా నాగబాబు అన్నారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు నాగబాబును ఏకేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీతో ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. రామ్ చరణ్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా చేస్తున్నాడు. మరో వైపు బన్నీని బావ బావ అంటూ చాలా సన్నిహితంగా ఉంటున్నాడు.
మెగా ఫ్యామిలీ హీరలైన చిరంజీవి, రామ్ చరణ్ కూడా నిన్నటి నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో తమ ఫ్యామిలీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ టైంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు మళ్లీ రెండు కుటుంబాల హీరోలు, అభిమానుల మధ్య గ్యాప్నకు కారణమవుతాయన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. అందుకే ఎన్టీఆర్ ఈ టైంలో నాగబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య అభిమానులు గతంలో తనకు బలయ్య ఎవరో తెలియదని అన్నారని.. మరి ఇప్పుడు నాగబాబు ఏ బాలయ్యను ఉద్దేశించి అన్నారని.. నాగబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.