తమిళ సినిమా ఇండస్ట్రీలో అన్ అఫీషియల్ నెంబర్ వన్ హీరో స్టేటస్ అనుభవిస్తున్నాడు హీరో విజయ్. రజినీకాంత్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు విజయ్ సినిమాకే వస్తున్నాయి. గత ఏడాది విజయ్ నటించిన బిగిల్ సినిమా సంచలనం సృష్టించింది. అదే సంచలనం ఆ తర్వాత అనేక వివాదాలకూ దారి తీసింది. ఇప్పుడు మరో వివాదం ఈ సినిమాపై జరుగుతోంది. బిగిల్ పై జాతీయ మీడియా సంస్థ ప్రసారం చేసిన ఓ కథనం ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బిగిల్ కు 20కోట్లు నష్టం వచ్చిందంటూ ప్రసారమైన ఆ కథనమే ఈ వివాదానికి కారణం.

IHG

 

రీసెంట్ గా ఆ జాతీయ ఛానెల్ ప్రసారం చేసిన ఈ కథనంలో మరో విషయం కూడా చెప్పుకొచ్చింది. బిగిల్ కు నష్టం వచ్చిందని కోప్రొడ్యూసర్ అర్చనా కల్పతే తమకు చెప్పిందని పేర్కొంది. దీంతో మరింత వేడెక్కిపోయిన విజయ్ ఫ్యాన్స్ ఆమెను వివరణ కోరారు. దీంతో.. ఇదంతా అబద్ధమని తాను ఎవరికీ బిగిల్ కు నష్టం వచ్చిందని చెప్పలేదని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. విజయ్ ఫ్యాన్స్ చేసిన ఆ ట్వీట్ ను ఆమె నిజమంటూ రీట్వీట్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ జాతీయ సంస్థపై మండిపడుతున్నారు.

IHG

 

గత ఏడాది బిగిల్ విషయంలోనే విజయ్ పై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులకు ‘మా సినిమాకు భారీ లాభాలొచ్చాయి..’ అంటూ అర్చనా కల్పతి చేసిన ఆ ట్వీట్ పెద్ద అలజడికి కారణమైందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ జాతీయ చానెల్ ప్రసారం చేసిన కథనంలో కూడా అర్చనా కల్పతే ప్రధాన కేంద్రంగా నిలిచింది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసి అర్చనా నుంచి క్లారిటీ తీసుకునే వరకూ ఊరుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: