అగ్ర హీరోలతో సినిమాలు చేయడం అంటే నిర్మాతలకు అంత ఈజీ కాదు. వారి డిమాండ్ లకు ఓకే చెప్పి సినిమాలను  చెయ్యాల్సి ఉంటుంది. అది ఏ హీరో అయినా ఏ నిర్మాత అయినా సరే కచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం. ఇప్పుడు మన తెలుగులో  నిర్మాతలు అన్నీ కూడా కమర్షియల్ సినిమాలను హీరోలతో చేస్తున్న సంగతి తెలిసిందే. యువ హీరోలు కూడా ఇప్పుడు అదే విధంగా ఆలోచన చేయడం తో దర్శక నిర్మాతలు చాలా వరకు జాగ్రత్తలు పడుతూ వస్తున్నారు. 

 

ఇప్పుడు దిల్ రాజు స్టార్ హీరోలను కొన్ని రోజులు పక్కన పెట్టాలి అని భావిస్తున్నారు. ఆయనకు ఈ ఏడాది రెండు సినిమాలు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా ఆయనను బాగా ఇబ్బంది పెట్టాయని ఆయన కొంత మంది సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. తాను వెనక్కు తగ్గినా ఒక హీరో వెనక్కు తగ్గకుండా మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన కొందరి వద్ద వ్యాఖ్యలు కూడా చేసారని సమాచారం. తనకు సినిమాలు ప్రాణం కాబట్టి తాను చాలా జాగ్రత్తగా ఉన్నా అని ఆయన చెప్పారట. 

 

ఇక ఆ హీరో దెబ్బకు భయపడిన నిర్మాత దిల్ రాజు ఇప్పుడు సీనియర్ హీరోలతో కొన్ని రోజులు అసలు సినిమాలు వద్దు అనే భావన లో ఉన్నారు అని  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఇప్పుడు ఆయన నానీ శర్వానంద్ వంటి హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్నారని వాళ్ళకే ఆఫర్లు ఇవ్వాలని వాళ్లకు ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు అని ఇలా కొందరి తో సినిమాలు చేసి ప్రశాంతంగా ఉండవచ్చు గాని పంచాయితి లు వద్దు అని ఆయన భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: