పూరీ హీరో బిజినెస్ మేన్ కన్ ఫ్యూజ్ లో ఎక్కువ కొట్టేశాడు. లాక్ డౌన్ టైమ్ లో పూరీ రాసుకున్న కథ కూడా కన్ ఫ్యూజ్ చేస్తోంది. ఆయన రాసుకున్న స్టోరీ ఎవరి కోసమో అర్థం కావడం లేదు. ఇంతకాలం బాలయ్య ఫ్యాన్స్ ను ఊరించింది. మన హీరో కోసమే రాసుకుంటున్నారని నందమూరి ఫ్యాన్స్ భావించారు. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చి కన్ ఫ్యూజ్ చేశాడు పూరీ. 

 

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో పూరీ గాడిలో పడ్డాడు. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో పూరీ పనైపోయిందన్న కామెంట్స్ వినిపించాయి. వీళ్లందరికీ ఇస్మార్ట్ తో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు పూరీ.

 

కరోనా ఇచ్చిన హాలిడేస్ ను వేస్ట్ చేయకుండా.. విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆలోచించకుండా.. కొత్త కథపై ఫోకస్ పెట్టాడు పూరీ. దర్శకుడు రాసుకుంటున్న కొత్త ఎవరి కోసమంటూ రకరకాల వార్తలొచ్చాయి. పైసా వసూల్ ఫ్లాప్ అయినా.. బాలకృష్ణ, పూరీ మరో సినిమా చేయాలనుకున్నారు. బాలయ్య కోసమే ఈ కథ రాసుకుంటున్నారన్న న్యూస్ బయటకొచ్చింది. 

 

లాక్ డౌన్ టైమ్ లో పూరీ రాసుకున్న కథ కూడా పాన్ ఇండియా మూవీనే. హీరోగా సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తోంది. మాస్ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీ రాసుకున్నాడట. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ పోకిరీ హిందీ రీమేక్ వాంటెండ్ తో పోయిన క్రేజ్ సంపాదించాడు. ఇదే నమ్మకంతో.. పూరీ కథ విని ఓకే చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది. 

 

విజయ దేవరకొండ మూవీతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన పూరీ.. వెనక్కి తిరిగి చూసుకోకుండా.. మళ్లీ అదే దారిలో వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. బాలయ్యతో తీస్తే.. తెలుగు సినిమా పరిమితం. అందుకే బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా కథ రెడీ చేసుకోవడమే కాదు.. ఏకంగా బాలీవుడ్ స్టార్ పై కన్నేశాడు. గతంలో అమితాబ్ తో తీసిన బుడ్డా హోగా తేరాబాప్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వాంటెడ్ ఒరిజినల్ వెర్షన్ పోకిరి డైరెక్టర్ గా హిందీలో గుర్తింపు తెచ్చుకున్న పూరీ.. విజయ్ మూవీతో మరోసారి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: