బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ల  గ్యాప్ అనంతరం గత ఏడాది సాహో తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు మొదటి షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో  హిందీ తప్ప మిగతా  భాషల్లో డిజాస్టర్ అయ్యింది. ఇంత విపరీతమైన నెగెటివ్ టాక్ తో కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 400కోట్ల వసూళ్లను రాబట్టింది. హిందీలో మాత్రం 150కోట్లవసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.ఈసినిమా శాటిలైట్ హక్కులను జీ నెట్ వర్క్ దక్కించుకుంది. ఇటీవల జీ మూవీస్ లో సాహో హిందీ వెర్షన్ ను ప్రదర్శించగా అదిరిపోయే టీఆర్పీని రాబట్టింది. 
 
ఇక తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్ త్వరలో  జీ తెలుగు లో ప్రసారం కానుంది దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళన్ని టీఆర్పీ రేటింగ్స్ పైనే వున్నాయి. ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరు తెలుగులో అత్యధికంగా 23.4 రేటింగ్స్ ను రాబట్టింది. మరి ఆ రికార్డు ను సాహో బద్దలు కొడుతుందో చూడాలి. కాగా కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే టీవీ లోకి వస్తుంటే సాహో మాత్రం థియేటర్లలో విడుదలైన 9నెలల తరువాత టీవిలోకి వస్తుంది.
 
ఇదిలావుంటే ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటివరకు 30శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది. ఈసినిమా కు ఇంకా సంగీత దర్శకుడిని ఫైనల్ చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: