సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న 27వ చిత్రం టైటిల్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈచిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ ను పెట్టనున్నట్లు గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి అయితే టైటిల్ పై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ మాత్రం టైటిల్ అదికాకపోవచ్చనే భావనలో వున్నారు కానీ ఈసినిమా టైటిల్ ఇదేనని సమాచారం. ఈరోజు ఈటైటిల్ గురించి అప్డేట్ రానుంది. ఇక రేపు మహేష్ తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ను లాంచ్ చేయనున్నారు. ఆ సమయంలో టైటిల్ ను రివీల్ చేయనున్నారు. గీత గోవిందం ఫేమ్ పరుశురాం తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతుంది. రేపు  ఈవిషయంలో కూడా  క్లారిటీ రానుంది . 
 
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ కెమెరామెన్ కాగా థమన్ సంగీతం అందించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ ప్లస్  ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనుండగా జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇక హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ హిట్ల తో మహేష్ సూపర్ ఫామ్ లో ఉండగా రెండేళ్ల క్రితం గీత గోవిందం తో  పరుశురాం100 కోట్ల క్లబ్ చేరడం తో సర్కార్ వారి పాట పై భారీ అంచనాలు వున్నాయి. ఈసినిమా తరువాత మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుండగా  2022 విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: