స్టార్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది అంటే ఆ సినిమాపై రావాల్సినన్ని రూమర్స్, ట్రోల్స్ వచ్చేస్తాయి. అందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలుసుకోడానికి టైం పడుతుంది. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా గురించి న్యూస్ వైరల్ గా మారింది. పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న మహేష్ సినిమా టైటిల్ గా సర్కార్ వారి పాత అని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ఈ సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నారట. ఇక ఈ సినిమాకు సంబందించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏంటంటే సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని అంటున్నారు. 

 

అందులో ఒకటి టీనేజ్ రోల్, రెండోది కాలేజ్ బోయ్ రోల్, మూడవది మిడిల్ ఏజ్ రోల్. ఈ మూడు పాత్రల్లో మహేష్ సర్ ప్రయిజ్ చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మహేష్ అదరగొట్టాడు. ఇక ఇప్పుడు పరశురామ్ డైరక్షన్ లో వస్తున్న మూవీలో కూడా మహేష్ 3 డిఫరెంట్ రోల్స్ తో షాక్ ఇస్తాడని తెలుస్తుంది. పొలిటికల్ సెటైర్ తో పాటుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియరా అద్వానీని తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. 

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు మహేష్. భరత్ అనే నేను నుండి సరిలేరు నీకెవ్వరూ వరకు హ్యాట్రిక్ హిట్లు అందుకున్న మహేష్ సర్కార్ వారి పాటతో డబుల్ హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తున్నాడు. ఒక లుక్కుతోనే మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఈ సినిమాలో మూడు పాత్రల్లో అంటే అబ్బో సర్కార్ వారి పాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సంబరాలు తెచ్చేలా ఉంది. ఈ సినిమాను 2021 ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: