సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మరో సినిమా ప్రకటించడానికి చాలా టైమ్ తీసుకుంటున్నాడు. వంశీతో సినిమా క్యాన్సిల్ అనుకున్న తర్వాత ఏ దర్శకుడితో వెళ్ళాలో అర్థం కాక చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికీ ఇంకా మహేష్ తర్వాతి చిత్రంపై అధికారిక ప్రకటన రాలేదు. పరశురామ్ మాత్రం మహేష్ తో సినిమా ఉంటుందని చెప్పేశాడు. మహేష్ సైడ్ నుండి వచ్చే కన్ఫర్మేష కోసమే అంతా ఎదురుచూస్తున్నారు.

 

అయితే రేపు మే 31వ తేదీన క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు రేపు ప్రకటన ఉంటుందా లేదా అన్న విషయం కూడా గ్యారెంటీ లేదు. కనీసం ఆ విషయమైనా క్లారిటీ లేదు. అయితే గత కొన్నేళ్ళుగా తన సినిమాల గురించిన అప్డేట్స్ అన్నీ క్రిష్ణగారి పుట్టినరోజునే ఇస్తున్న మహేష్, ఈ సారి కూడా అలాగే ఫాలో అవుతాడని అనుకుంటున్నారు.

 

అయితే సినిమా ప్రకటన గురించి కన్ఫర్మ్ రాకపోయినా సినిమా పేరు అప్పుడే బయటకి వచ్చేసింది. సర్కారి వారి పాట అనే టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మహేష్-పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రానికి సర్కారి వారి పాట అనే భిన్నమైన టైటిల్ పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ రూమర్ బయటకి వచ్చింది. సర్కారి వారి పాటలో మహేష్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడట.

 

ఇప్పటి వరకూ మహేష్ ట్రిపుల్ రోల్ వేయలేదు. అలాంటిది మొదటిసారి ఈ సినిమా కోసం మహేష్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడట. ఇదే నిజమైతే మహేష్ అభిమానులు పండగ చేసుకుంటారు. దీనిపై వివరణ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదేమో.. చూడాలి మరి రేపైనా ఈ సినిమాపై అధికారిక సమాచారం వస్తుందో రాదో..!

మరింత సమాచారం తెలుసుకోండి: