తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య స్నేహబంధం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చాలా మంది హీరోలు ఎంతో ఫ్రెండ్లీగా స్నేహ పూరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు . అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు దర్శకులు మధ్య స్నేహపూరిత వాతావరణం ఎలా ఉందో కొంతమంది మధ్య విభేదాలు కూడా అలాగే ఉన్నాయి . కొంతమంది మధ్య తలెత్తిన వివాదాలు అయితే ఏకంగా కొన్ని రోజులపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా సంచలనం సృష్టించిన వివాదాలలో ఒకటి బాలయ్య రామ్ చరణ్ వివాదం. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ వివాదం మొదలై ఎన్నో రోజుల పాటు సాగింది. 

 


 ఇంతకీ ఏం జరిగింది అంటారా.... ఒకానొక సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ దర్శకులను కాస్త చిన్న చూపు చూస్తూ మాట్లాడినట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. సూర్య హీరోగా నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా తెలుగు లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఈవెంట్ అప్పుడు రామ్చరణ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమిళ దర్శకుడు మురుగదాస్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారని గజినీ ని  ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని టాలీవుడ్ లో ఇలాంటి దర్శకులు లేరు అంటూ వ్యాఖ్యానించాడు. 

 


 ఇక అప్పట్లో రామ్ చరణ్ వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారగా నందమూరి బాలకృష్ణ రామ్ చరణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...  ఒక్క గుడ్డోడు అన్నాడు తెలుగులో గొప్ప  డైరెక్టర్లు లేరు అని.. కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి గొప్ప దర్శకుల తెలుగు చిత్ర పరిశ్రమలో వున్నారు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. అంతెందుకు మొన్నటికి మొన్న ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఆ బుడ్డోడు కి ఒక మంచి హిట్ కూడా ఇచ్చాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఆ బుడ్డోడు కి ఫోన్ చేశాను చెంప పలుగులుద్దీ  అంటూ చెప్పాను అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పట్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రామ్చరన్ ను  ఉద్దేశించి చేసాడు  అని వివాదంగా మారింది.  ఇక ఇదే విషయమై ఒక సారి మీడియా బాలయ్య రామ్ చరణ్ ని ఎందుకు అలా అన్నాడు  అంటూ చిరంజీవిని అడగగా సమాధానం దాటవేశాడు. ఏదేమైనా వీరిద్దరి మధ్య వివాదం మాత్రం అప్పట్లో పెద్ద సంచలనం గానే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: