యాంక‌ర్ అన‌సూయ‌.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. తెలుగు బుల్లితెరపై తనదైన మార్కుతో అంద‌రినీ ఆకట్టుకొంటున్న అనసూయకు ఎంద‌రో అభిమానులు ఉన్నారు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటి అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లు సైతం దక్కించుకుంటోంది. ఇక పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ.. ప్ర‌స్తుతం స్టార్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది.

 

ఇక బుల్లితెర మీద సందడి చేస్తూనే వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ముఖ్యంగా క్షణం, రంగస్థలం వంటి సినిమాలో అనసూయ బిగ్ స్క్రీన్ పై తన యాక్టింగ్ స్కిల్స్ తో ఒక స్పెషల్ మ్యాజిక్ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ముచ్చ‌టిస్తుంది. ఈ క్ర‌మంలోనే సుశాంక్‌ భరద్వాజ్ తో నా ప్రేమ ఎన్సీసీ క్యాంపులో మొదలైంది. క్యాంపులో నాకు ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. ఆ సమయంలో నాకు ప్రేమ, అఫైర్స్ లాంటి వాటిపై నమ్మకం లేదు. అందుకే మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

 

అయితే ఆ త‌ర్వాత‌ ఒకర్నొకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో నన్ను ఎంబీఏ కూడా మా ఆయనే చదివించారు. ఈ క్ర‌మంలోనే చాలాసార్లు మనమే పెళ్లి చేసుకొందామని ఫోర్స్ చేశాను. కానీ అలాంటి పెళ్లికి గౌరవం ఉండదని చెప్పాడు. అలా తొమ్మిది ఏళ్ల వెయిట్ చేసి  నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకొన్నాం. ఇప్పుడు జూన్ 5వ తేదీకి మా పెళ్లి జరిగి పదేళ్లు పూర్తి అవుతుంది. అప్పుడే మా దాంపత్య జీవితానికి పదేళ్లా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఆయన సపోర్ట్ నాకు బాగా ఉంది. 

 

ఇక అందరి ఇంట్లో మాదిరిగానే మా మధ్య కలహాలు, కలతలు ఉంటాయి. వారానికి ఓ సారి మేము ఏదో విషయం మీద గొడవ పడుతుంటాం. మా మధ్య మూడో వ్యక్తి కారణంగా గొడవలు అవుతుంటాయి. ఇక మేమైతే ప్రతివారం విడాకులు తీసుకుంటాం.. కానీ, అంత‌లోనే మ‌ళ్లి క‌లిసిపోయి మాట్లాడుకుంటామ‌ని న‌వ్వుతూ చెప్పుకొచ్చింది అన‌సూయ‌. ఇక మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు... మన ఇద్దరం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు గొడవలు ఎందుకు అనుకొంటాం. కానీ రెండు హృదయాలు, రెండు మనసులు ఒక్క చోటు ఉంటే అభిప్రాయ భేదాలు ఉంటాయ‌ని.. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంది. 

   
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: