టాలీవుడ్ లో పుష్ప సినిమా ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిందో ఇక అక్కడి నుంచి కూడా సినిమా టాలీవుడ్ లో జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి పెంచుతుంది అనేది వాస్తవం. ఈ సినిమా కోసం ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఇక ఎప్పుడు విడుదల అవుతుంది అంటూ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా  కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో లేడీ విలన్ ని తీసుకునే ఆలోచనలో అతను ఉన్నాడు అనేది చాలా మంది నుంచి వినపడుతున్న మాట. అతను లేడీ విలన్ ని తీసుకునే విషయంలో ఇప్పటికే బన్నీ తో కూడా చర్చలు జరిపాడు అని అతను కూడా అందుకు ఓకే చెప్పాడు అని అంటున్నారు. ఈ సినిమా వచ్చే  ఏడాది ఎలా అయినా సరే ప్రేక్షకుల ముందుకి రావడం దాదాపుగా ఖాయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కొన్ని పాత్రల విషయంలో స్పష్టత రావడం లేదని సమాచారం. 

 

లేడీ విలన్ గా విజయశాంతి లేదా రోజా ని తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. చిత్తూరు యాస్ రోజా అయితే చాలా బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడుక్ చర్చలు జరుగుతున్నాయి అని రోజా అందుకు ఓకే చెప్పారు అని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: