టాలీవుడ్ లోకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ఆ తర్వాత నాగ చైతన్యన నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీలో నటించింది. బ్యాడ్ లక్ ఈ రెండు మూవీల్లోనూ పెద్దగా పేరు తెచ్చుకోలేదు.. కారణం ఇందులో ఈ అమ్మడు గ్లామర్ చూపించడానికి ఏమాత్రం ఛాన్స్ లేకండా పోయింది. దాంతో ఈ బ్యూటీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీలో బికినీతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. మంచి ఫిట్ నెస్ బాడీతో ఎంతో అందంగా ఉండే పూజా హెగ్డే ఈ మూవీలో తన అందాలతో అభిమానులను మాత్రమే కాదు దర్శక, నిర్మాతలను కూడా ఆకట్టుకుంది. అంతే వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.
ఇలా మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, త్వరలో ప్రభాస్, అఖిల్ అక్కినేని తో నటించబోతుంది. తెలుగు తో బాటుగా హిందీలో కూడా బిజీగా మారింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అభిమానులు ఇంటిపట్టున ఉంటున్నారు. అరవింద సమేత, మహర్షి , అల వైకుంఠపురములో ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ భామ ప్రస్తుతం తన అందాలకు మెరుగులు దిద్దుకుంటుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు కొద్ది రోజులుగా వర్కవుట్స్కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రాములో శరీరాన్ని విల్లులా వంచిన ఫోటోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ నోరెళ్ళపెడుతున్నారు. గతంలోను పూజా ఇలాంటి ఫోటోనే షేర్ చేయగా అది ఫుల్ వైరల్ అయింది. సమంత అందంపై చేసిన పోస్ట్ పూజాకి లేని పోని చిక్కులని తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.