దీపికా పదుకొణె బాలీవుడ్ బ్యూటీ. హాట్ అండ్ స్వీట్. ఆ అమ్మడుని సౌత్ వైపు తీసుకొద్దామని  ఇప్పటికి ఎన్నో ట్రయల్స్ జరిగాయి. కానీ ఏవీ కూడా సక్సెస్ కాలేదు. ఇపుడు మాత్రం అది గట్టిగానే కుదిరేట్టునంది. పైగా టాలీవుడ్ రెబెల్ స్టార్ అందగాడు ప్రభాస్ సరసన దీపిక నటిస్తుందని అంటున్నారు.

 

ప్రభాస్ ప్రస్తుతం రాధాక్రిష్ణ డైరెక్షన్లో జాన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయితే తరువాత సినిమా వైజయంతి మూవీస్ లో ఉంటుంది. ఇది పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. దీనికి మహానటికి డైరెక్షన్ చేసిన నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఆయన ప్రభాస్ తో భారీ ఎత్తున ఈ సినిమా తీస్తున్నారు.

 

సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అయ్యేలాగ ఉంది. కరోనా ఎఫెక్ట్, దానితో పాటు లాక్ డౌన్ కారణంగా జాన్ సినిమా షూటింగ్ లేట్ అవుతుంది. ఆ తరువాత వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అంటున్నారు. 

 

ఇక దీపికా ప్రభాస్ జంట అంటేనే ఆడియన్స్ లో కొత్త క్రేజ్ వస్తుంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, సాహోతో బాలీవుడ్లో తన సత్తా చాటుకున్నారు. ఉత్తరాదిన ప్రభాస్ మూవీస్ చూడడానికి బళ్లు కట్టుకుని జనం వస్తున్నారు. అది చాలు బాలీవుడ్లో ప్రభాస్ పాగా వేశాడని చెప్పడానికి.

 

 ఆయనకు జోడీగా దీపిక కనుక  కుదిరితే ఈ ఇద్దరూ సౌత్ నార్త్ అని చూడకుండా మొత్తం ఆల్ ఇండియాకే ఫెవరేట్ జంట అయిపోవడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ సహా దేశం మొత్తం ఆశగా ఎదురుచూసే మూవీస్ లో ఇది ఒకటి అని చెప్పకతప్పదు. 

 

దీపికను తెలుగు తెర మీద చూద్దామనుకున్న వారి కలలు కూడా ఈ దెబ్బకు తీరే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి సరైన టైంలో సరైన మూవీతో దీపిక ఎంట్రీ ఇస్తోందన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: