సాయి పల్లవి కి అతి తక్కువ కాలంలో క్రేజ్ వచ్చింది అనేది వాస్తవం. తన సొంత భాష లో అయినా మన తెలుగులో అయినా సరే ఆమెకు చాలా తక్కువ కాలంలో క్రేజ్ వచ్చింది అనేది వాస్తవం. ఆమె సినిమాలు ఆమె నటన ఆమె డాన్స్ అన్ని కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఆమె సినిమాలకు మన తెలుగులో మంచి ఆదరణ అనేది వచ్చింది. ఇక  ఇప్పుడు ఆమె ఏ సినిమా చేస్తుంది అనేది ప్రేక్షకుల్లో కూడా ఒక ఆసక్తి అనేది ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మాత్రం ఎక్కడా కూడా కంగారు లేకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే సినిమాలు చేస్తూ వస్తుంది. 

 

ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా సినిమాలు వాయిదా  పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాల తర్వాత ఆమె తెలుగుకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆమెకు నానీ తో సినిమా చేసే అవకాశం వచ్చింది అని టాక్. నానీ తో ఆమె సినిమా చేయడం దాదాపుగా ఖాయం అయిందని... అయితే నానీ మాత్రం ఆమె విషయంలో కోపం గా ఉన్నాడు.. అని ఆమెతో నటించే ఆసక్తి లేదు అని చెప్పాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

నానీకి ఆమెకు గతంలో ఒక సినిమా సమయంలో గొడవ జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఉంది. ఇక నానీ కూడా ఒక నిర్మాత వద్ద ఆమె మీద విమర్శలు కూడా చేసాడు అని ప్రచారం జరిగింది. అలా విమర్శలు చేయడం ఆమెకు అసలు నచ్చలేదు అని సమాచారం. అందుకే ఆమె నానీ తో సినిమాలు చేయడానికి ముందు ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: