మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇస్మార్ట్ బ్యూటి నిధీ అగర్వాల్. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసింది. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కినేని నాగ చైతన్య తో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అయినా మళ్ళీ తమ్ముడు అఖిల్ అక్కినేని తో మిస్టర్ మజ్ఞు సినిమాలో నటించింది. చెప్పాలంటే మొదటి సినిమా కంటే రెండవ సినిమాతో నిధీ అగర్వాల్ కి రెండవ సినిమాతో మంచి పేరు వచ్చింది.

 

హీరోయిన్ గా కావాల్సినంత గ్లామర్ అలాగే క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎక్స్‌ఫోజింగ్ యాక్టింగ్ ఇలా అన్ని విషయాలలో నిధీ కి మంచి మార్కులే పడ్డాయి. కాని ఎక్కడ తేడా కొట్టిందో తెలీలేదు. ఫ్లాప్ హీరోయిన్ అన్న పేరు పడింది. అయితే పూరి జగన్నాధ్ దాని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చెరిపేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది నిధీ అగర్వాల్. మరో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ తో పోటీ పడి ఈ సినిమాలో నటించింది. కాని ఆ తర్వాత అనుకున్న ఆశలన్ని అలానే ఉండిపోయాయి. 

 

నభా కైతే వరసగా సినిమాలు వస్తున్నాయి గాని నిధీకి మాత్రం ఎందుకనో వరసగా సినిమాలు పడటం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా డిస్కో రాజా చేసింది. అలాగే మెగా హీరో సాయి ధరం తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటరు అన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరోసారి రవి తేజ సినిమాలో నటిస్తుంది. అయితే నభా మాదిరిగా నిధీ మాత్రం దూసుకుపోవడం లేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ లో నభా చేసిన హంగామా నిధీ చేయలేదనే చెప్పాలి. సాఫ్ట్ క్యారెక్టర్ కావడం తో సినిమా సూపర్ హిట్ అయినా నభా కి వచ్చిన క్రేజ్ నిధీ కి రాలేదని అందుకే రేస్ లో కాస్త నభా కంటే వెనకబడి ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: