పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి వీరిద్దరి కాంబోపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా రేంజ్ చిత్రం ఇది. దాంతో పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి.

 

 

ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడని సమాచారం. మొఘలుల కాలంనాటి పీరియాడికల్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని చెప్పారు. ఔరంగజేబు కాలం నాటి పరిస్థితులని క్రిష్ చూపించబోతున్నడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి అప్డేట్ బయటకి వచ్చింది.

 

 

పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా కనిపించనుందట. అయితే జాక్వెలిన్ ఒకానొక రాజుకి సోదరిగా నటించనుందట. అంతే కాదు సినిమా సెకండ్ ఆఫ్ లో ఆ పాత్ర చనిపోతుందని అంటున్నారు. ఆ సన్నివేశం సినిమాల్లో చాలా కీలకమైనదని చెబుతున్నారు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ కి ఇది రెండవ తెలుగు సినిమా అవుతుంది.

 

 


ఇదివరకే ప్రభాస్ సినిమా సాహో లో నటించి, స్టెప్పులతో మైమరిపించింది. ఇకపోతే పవన్- క్రిష్ కాంబోలో మూవీకి విరూపాక్ష అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఏ ఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో సినిమా షూటింగులకి అనుమతులు లభించనున్న నేపథ్యంలో విరూపాక్ష చిత్రీకరణకి ప్లానింగ్స్ జరుగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: