సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత చేయబోయే సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు కృష్ణా పుట్టినరోజు సందర్భంగా పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమా చేయనున్నట్లు మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. మరొక హ్యాట్రిక్ విజయానికి ఈ సినిమా నాంది పలుకుతుందని సోషల్ మీడియా లో మహేష్ బాబు చెప్పుకొచ్చారు. సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో 'అతిధి' సినిమాలో ఉన్నట్టు ఫుల్ జుట్టు, మెడ మీద రూపాయి బిళ్ళ టాటూ అదే రీతిలో చెవిపోగు ఉండటంతో చాలా డిఫరెంట్ లూక్ లో మహేష్ ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

IHG

మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కాగా ఈ సినిమాలో 'భరత్ అనే నేను' లో తన పక్కన నటించిన హీరోయిన్  కియారాను తీసుకోవాలని మొదటిలో మహేష్ బాబు భావించడం జరిగింది. దీంతో పరశురామ్ తో ఈ విషయం గురించి మహేష్ బాబు చర్చలు జరిపారట. ఈ సందర్భంలో  కియారా బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్న తరుణంలో ఆమె డేట్ లతో సమస్య వచ్చే అవకాశం ఉందని మహేష్ కి తెలిపారట.

IHG

పైగా ప్రజెంట్ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలని మహేష్ బాబుకి పరుశురాం సలహా ఇచ్చినట్లు ఫిలింనగర్ లో టాక్. దీంతో సినిమా హీరోయిన్ విషయంలో మహేష్ బాబు డైరెక్టర్ సలహా విని వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరోపక్క సెలెక్ట్ చేయడానికి మరో హీరోయిన్ వేటలో సినిమా యూనిట్ పడినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: