టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. చివరిగా ఇటీవల సరిలేరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ నటించబోయే తదుపరి సినిమాపై గత కొద్దిరోజులుగా విపరీతంగా పలు వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించే వారిలో వంశీ పైడిపల్లి, పరశురామ్ ల పేర్లు ప్రముఖంగా వినిపించగా, ఎట్టకేలకు ఆయన నెక్స్ట్ సినిమాని తీయబోయేది పరశురామ్ అని నేడు అధికారిక ప్రకటన తో పాటు సినిమా టైటిల్, అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు నిర్మాతలు. 

 

14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మహేష్ తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు చిత్ర నిర్మాతలు. కాగా ఆ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానులు నుండి విపరీతమైన స్పందన లభించింది. ఇకపోతే గత కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ వలన మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఫ్యామిలీ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న మహేష్, కాసేపటి క్రితం అభిమానులతో కలిసి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చాట్ సెషన్ లో పాల్గొని వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 

 

అవకాశం ఉన్నంతవరకు తనకు వీలైనంత మంది ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నానని, మిగతావారికి సమాధానం ఇవ్వలేనందుకు తప్పుగా భావించవద్దని మహేష్ కోరారు. ఇకపోతే తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా గురించి చెప్పమని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మహేష్, ఈ సినిమా మంచి స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు పలు రకాల కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ హంగులతో తెరకెక్కుతోందని, తప్పకుండా మీ అందరినీ అలరించేలా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు మహేష్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: