టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇటీవల కొన్నాళ్ల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకుని కెరీర్ పరంగా మహేష్ కు వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందించడం జరిగింది. ఇకపోతే దాని తరువాత నేడు తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాని అధికారికంగా ప్రకటించిన మహేష్, అతి త్వరలో లాక్ డౌన్ ముగిసిన అనంతరం దాని షూటింగ్ లో పాల్గొననున్నట్లు చెప్పారు. 

IHG

ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మించనున్నాయి. ఇకపోతే నేడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని కాసేపటి క్రితం అభిమానులు, ప్రేక్షకులతో కలిసి తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా చాట్ సెషన్ లో పాల్గొన్న మహేష్, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇకపోతే చాట్ సెషన్ లో భాగంగా మీతో కలిసి నటించిన హీరోయిన్లైన సమంత, రష్మిక ల్లో మీకు ఎవరు అంటే ఇష్టం అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా, వాస్తవానికి తనకు ఆ ఇద్దరు హీరోయిన్లు అంటే ఎంతో ఇష్టం అని, ఇద్దరితో కలిసి పని చేసిన సినిమాల ఎక్స్ పీరియన్స్ తాను ఎప్పటికీ మరిచిపోలేనని మహేష్ అన్నారు. నిజానికి మొత్తంగా సమంతతో కలిసి మహేష్ బాబు మూడు సినిమాల్లో నటించారు. 

IHG

దూకుడు, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో నటించారు. అలానే రష్మికతో ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరులో నటించారు మహేష్. ఎంత ఎదిగినా కూడా సెట్స్ లో అందరితో అలానే హీరోయిన్స్ తో కూడా ఎంతో సరదాగా కలిసిపోయి వ్యవహరించే సూపర్ స్టార్ మహేష్, ఈ విధంగా అటు సమంత, ఇటు రష్మిక ఇద్దరి గురించి ఇలా వారిద్దరూ తనకు ఇష్టం అని, ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా సమాధానం ఇవ్వడం కొంత షాకింగ్ గా ఉందని, అందుకే ఆయన అంత గొప్ప సూపర్ స్టార్ అయ్యారు అంటూ కొందరు అభిమానులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: