గతవారం బాలకృష్ణ తనను చిరంజీవి ఇంటిలో జరుగుతున్న సమావేశాలకు పిలవడంలేదు అన్న విషయం పై తన అసహనాన్ని ప్రదర్శిస్తూ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ అన్న కామెంట్స్ ఇండస్ట్రీలో పెను వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఫిలిం యూనివర్సిటీ నిర్మాణం చేయాలని తెలంగాణా ప్రభుత్యం ఆలోచనలు చేస్తూ దానికి అవసరం అయితే 1000 కోట్లు 1000 ఎకరాలు కేటాయించే ఆలోచనలు చేస్తూ దానికి సలహాలు ఇవ్వండి అంటూ కొందరు తెలంగాణా ప్రభుత్వ పెద్దలు చిరంజీవిని కోరారు అన్న వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి.  


ఒకవేళ ఇలాంటి భారీ సంస్థలు ఏర్పడితే ప్రస్తుతం టాలీవుడ్ కు నాయకత్వం వహించే వ్యక్తులకు మరింత పేరు వస్తుందని బాలయ్య అభిప్రాయం అయి ఉంటుంది అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలలో తెలియకపోయినా చిరంజీవిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ అన్న మాటలకు ఇండస్ట్రీలో ఎవరి వైపు నుంచి తనకు సపోర్ట్ లభించక పోవడంతో ప్రస్తుతం బాలకృష్ణ తీవ్రంగా అసహనంతో రగిలిపోతున్నట్లు టాక్.


ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ కారణంగా మొదటి షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్రీకరణ ఆగిపోయిన బోయపాటి బాలయ్యల మూవీ షూటింగ్ ను తిరిగి షూటింగ్ లు ప్రారంభం అయిన వెంటనే ఈమూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి 2021 సంక్రాంతికి సినిమాను విడుదలచేయమని బాలయ్య పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి.  


బాలయ్య ఆలోచనల ప్రకారం అన్ని అనుకున్నట్లుగా జరిగితే చిరంజీవి ‘ఆచార్య’ మూవీతో ఈ మూవీ పోటీపడే అవకాశం ఉంది. అదే జారితే చిరంజీవి పై బాలయ్య స్వీట్ రివెంజ్ తీర్చుకోవడమే కాకుండా మళ్ళీ రాబోతున్న సంక్రాంతికి బాలకృష్ణ చిరంజీవిల అభిమానుల మధ్య వార్ జరిగే అవకాశం కనిపిస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: