మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్లో 66వ చిత్రంగా 'క్రాక్' మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్స్ కి అనుమతులు లభించిన వెంటనే మిగతా భాగాన్ని కంప్లీట్ చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత రవితేజసినిమా స్టార్ట్ చేయాలో అని డైలమాలో పడ్డాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజా 'రాక్షసుడు' దర్శకుడు రమేష్ వర్మ తో ఓ చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి 'వీర' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని హీరో కోనేరు హవీష్ ప్రొడక్షన్ హౌజ్ లో నిర్మించబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్ అంశంలో చిన్న పాటి అవకతవకలు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడ్డట్టు.. అలాగే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే వరకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వార్తలు వచ్చాయి.

 

దీంతో ఈ రూమర్ పై నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ ప్రాజెక్ట్ వాడిదా పడలేదని.. త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నామని వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ సజీవంగానే ఉందని అర్థం అయింది. అయితే మాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనున్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. 'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న త్రినాథరావు నక్కిన చెప్పిన స్టోరీ రవితేజకు నచ్చిందని.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు స్టార్ట్ చేయాలో అనే డైలమాలో పడ్డాడట మాస్ మహారాజా. రవితేజ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడో అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇదిలా ఉండగా క్రాక్ సినిమాతో రవితేజ తన క్రేజీ కాంబో శృతి హాసన్ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి కలవబోతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది. రవితేజ - గోపిచంద్‌ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను' 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ అంచనాలను పెంచేసింది. 'క్రాక్' చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్లో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: