సూపర్ స్టార్ మహేష్ తన 27వ సినిమా టైటిల్ రివీల్ చేశాడు. సర్కారు వారి పాట అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు మహేష్. గీతా గోవిందం తర్వాత పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ టోన్ అంచనాలు పెంచారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తాడని టైటిల్ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. సోషల్ మెసేజ్ తో పాటుగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని అంటున్నాడు మహేష్. అంతేకాదు పరశురామ్ ఈ సినిమాను బాగా తెరకెక్కిస్తారని అనుకుంటున్నా అంటూ నిన్న ఫ్యాన్స్ తో జరిగిన ఇంటరాక్షన్ లో చెప్పాడు మహేష్. 


ఇక   సర్కారు వారి పాట సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కథ పరశురామ్ అల్లు అర్జున్ కోసం రాసుకోగా బన్నీ నచ్చలేదని చెప్పడంతో అదే కథని మహేష్  ఒప్పించాడట పరశురామ్. అల్లు అర్జున్ కాదన్న కథ మహేష్ ఓకే చేశాడని అంటున్నారు. భరత్ అనే నేను సినిమా నుండి సరిలేరు నీకెవ్వరు వరకు హ్యాట్రిక్ హిట్ అందుకున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. 


ఒక హీరో కాదన్న కథతో మరో హీరో సినిమా తీసి హిట్టు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సర్కారు వారి పాట కూడా నిజంగా బన్నీ చేయనని చెబితే మహేష్ ఈ సినిమాతో హిట్ కొడితే మాత్రం బన్నీ మంచి ఛాన్స్ మిస్ అయినట్టే. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కియరా అద్వానీని తీసుకునే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. థమన్ మ్యూజిక్అందిస్తున్న ఈ సినిమా 2021 ఉగాదికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: