మహేష్ బాబు సినిమా విడుదల అవుతుంది అనగానే సినిమాలో నటులు ఎవరు కథ ఏ విధంగా ఉంటుంది సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది సహా యెన్నో విషయాల మీద  జనాలకు పైకి చెప్పలేని విధంగా ఉత్సాహం అనేది ఉంటుంది. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఏమో గాని సినిమా విడుదలకు ముందు మాత్రం అనేక చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు అతను పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని నిన్న చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

సర్కారు వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. ఇక ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు పాత్ర సహా అనేక విషయాల మీద ఇప్పుడు  చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో నమ్రత నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో ఆమె నటించడం దాదాపుగా ఖాయం అయిందని ఈ సినిమాలో ఆమె మహేష్ బాబు కి భార్యగా కూడా కనపడుతుందని అంటున్నారు. 

 

ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీని మీద ఆమాత్రం అనేక చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఉంటారు అని కూడా సమాచారం. ఇప్పటికే కథను వినిపించారు అని ఆయన అందుకు ఓకే చెప్పారు అని తెలుస్తుంది. వాస్తవం ఎంత అనేది తెలియదు గాని ప్రస్తుతం దీని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా నిర్మాతలు కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: