అక్కినేని వారసుడు అఖిల్ హీరోనా ఎంట్రీ ఇచ్చి 3 సినిమాలు చేశాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడు సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అని టైటిల్ పెట్టారు. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే అఖిల్ కు హిట్ ఇచ్చేనందుకు సిద్ధమైంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని టాక్. 


దాదాపు షూటింగ్ పార్టీ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను నాగార్జున చూసినట్టు టాక్. ఏదైతే బొమ్మరిల్లు భాస్కర్ తనకు చెప్పాడో అదే తెర మీదకు తెచ్చాడని తెలుస్తుంది. సినిమా చూసి నాగార్జున హ్యాపీ అయ్యారట అఖిల్ కు ఈ సినిమాతో మొదటి హిట్ కంపల్సరీ అంటున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ కూడా రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. లాక్ డౌన్ తర్వాత వరుసగా సినిమాలన్నీ లైన్ లో రిలీజ్ అవుతాయి. వాటిలో అఖిల్ బ్యాచ్ లర్ మూవీని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. 


సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటమే కాకుండా తప్పకుండా బొమ్మరిల్లు లాంటి మేజిక్ ఈ సినిమాకు వర్క్ అవుట్ అవుతుందని అంటున్నాడు నాగార్జున. అదే జరిగితే అక్కినేని అఖిల్ కూడా హిట్టు ఖాతా తెరచినట్టే అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ మూవీతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ కూడా బాగుటుందని టాక్. మరి అఖిల్ ని భాస్కర్ ఏం చేస్తాడో చూడాలి.                

మరింత సమాచారం తెలుసుకోండి: