కరోనా వల్ల సినిమా పరిశ్రమ కూడా చాలా నష్టాన్ని ఎదుర్కొంటుంది. షూటింగ్స్, థియేటర్లు అన్ని ఆపేయగా త్వరలోనే షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చేశారు. థియేటర్లు మాత్రం ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఇలాంటి సందర్భంలో ఈ నష్టాన్ని కొద్దిగా తగ్గించాలి అంటే స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అంటున్నారు సౌత్ స్టార్ డైరక్టర్ మణిరత్నం. రాబోయే రోజుల్లో థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అంతా సెట్ రైట్ అయ్యేంతవరకు హీరోలు, టెక్నీకల్ టీమ్ అంతా రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందే అంటున్నారు మణిరత్నం. 


ప్రస్తుతం మణిరత్నం పొన్నియి న్ సెల్వన్ సినిమా చేస్తున్నారు. పదో శతాబ్దం నాటి కథతో పిరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది. కార్తీ, జయం రవి హీరోలుగా చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను అసలైతే తమిళ హీరో విజయ్, సూపర్ స్టార్ మహేష్ లతో తెరకెక్కించాలని అనుకున్నాడు మణిరత్నం. కానీ వాళ్లిద్దరూ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే కోలీవుడ్ హీరోలతో తీస్తున్నాడు. సూర్య బ్రదర్ కార్తీతో చెలియా సినిమా చేశాడు మణిరత్నం. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 


ఇక ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తున్నాడు మణిరత్నం. కోలీవుడ్ మీడియా ఈ సినిమాను తమిళ బాహుబలిగా ప్రస్తావిస్తుంది. మరి బాహుబలి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈపాటికి రావాల్సింది కానీ లాక్ డౌన్ వల్ల అది రిలీజ్ చేయలేదు. మణిరత్నం మాత్రం ఈ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్ భారీ స్టార్ కాస్ట్ తో సినిమా తెరకెక్కుతుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: