గీత గోవిందం సినిమాతో తన గీత మార్చుకున్న పరశురామ్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ముందుగా పరశురామ్ తో సినిమా అనగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పరశురామ్ ఇప్పటి వరకు స్టార్ హీరోని డీల్ చేసిన సందర్భాలు లేవు. రవితేజతో సినిమా తీసినా అందులో ఒకటి పూర్తి క్లాస్ సినిమా. అదీగాక ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. దాంతో పరశురామ్ మహేష్ బాబుని ఎలా చూపిస్తాడన్న సందేహం అందరిలో కలిగింది.

 

అయితే గత కొన్ని రోజులుగా మహేష్ మిడి రేంజ్ దర్శకులకే అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అనిల్ రావిపూడికి అవకాశం అలానే వచ్చింది. అనిల్ రావిపూడి కెరీర్లో అన్నీ హిట్లే ఉన్నప్పటికీ రవితేజ తర్వాత మరీ పెద్ద హీరోతో సినిమా చేయలేదు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి మహేష్ ని చూపించిన తీరు అందరికీ బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

 

అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం పరశురామ్ మీద చేసాడు. పరశురామ్ కెరీర్ ని గమనిస్తే మొదటి సినిమా యువత మొదలుకుని, సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు మొదలగు చిత్రాలన్నీ యావరేజ్ గా అనిపించుకున్నవే. ఒక్క గీత గోవిందం సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదీగాక పరశురామ్ తీసినవన్నీ క్లాస్ చిత్రాలే. కానీ మహేష్ బాబుని అభిమానులు మాస్ సినిమాలో చూడాలనుకుంటున్నారు.

 

మహేష్ అభిమానులకి పరశురామ్ మాస్ ప్రేక్షకులని కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయని మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాట నిజమేనని టైటిల్ పోస్టర్ ని చూస్తే అర్థమైపోయింది. మాస్ టైటిల్ తో పాటు, మహేష్ బాబుని కొత్త అవతారంలో చూపించబోతున్నట్టు చెప్పేసాడు. మెడ మీద రూపాయి టాటూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. మొత్తానికి పరశురామ్ చెప్పినట్టు మాస్ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: