బాలీవుడ్ సూపర్ స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకరు. ఖాన్ త్రయం ఏడాదికి ఒక సినిమా చేయడానికే తడబడుతున్న టైమ్ లో అక్షయ్ కుమార్ నుండి ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అతని చేతిలో ఎప్పుడూ మూడు నుండి నాలుగు సినిమాలు ఉంటాయి. సీనియర్ హీరో అయిన అక్షయ్ కుమార్ ఇప్పటి తరంతో పోటీ పడుతూ వరుస హిట్లు కొడుతూ వెళ్తున్నాడు. కరోనా వల్ల అన్ని సినిమా షూటింగులు నిలిచిపోవడంతో ఇంటివద్దే ఉంటున్నారు.

 

కరోనా సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండడానికి 25కోట్లు విరాళం ప్రకటించిన మొదటి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమారే. అయితే తాజాగా ఒకానొక వార్త అక్షయ్ కుమార్ ని బాగా ఇబ్బంది పెట్టిందట. ఈ మధ్య టాలీవుడ్ లోని ఓ గాసిప్ సైట్ లో రాసిన వార్తల గురించి పెద్ద ఎత్తున సెలెబ్రిటీలందరూ తమ వ్యతిరేకతని తెలియజేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యతిరేకతే ఇప్పుడు అక్షయ్ కుమార్ వెలిబుచ్చుతున్నాడు.

 

లాక్డౌన్ టైమ్ లో తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరు పిల్లల్ని తిరిగి ఢిల్లీ పంపించేందుకు అక్షయ్ ప్రత్యేకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడంటూ ఓ ప్రముఖ వెబ్ సైట్ వార్త రాసింది. ఈ వార్తే అక్షయ్ కుమార్ కి విపరీతమైన కోపం తెప్పించింది. అయితే ఇందుకు వివరణ ఇచ్చిన అక్షయ్ కుమార్, నా సోదరి లాక్డౌన్ టైమ్ లో అసలు ప్రయాణమే చేయలేదని, అదీగాక తనకి ఒక్కరే సంతానం అనీ చెప్పాడు.

 

ఇలాంటి అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే అక్షయ్ స్పందన చూసిన తర్వాత ఆ వెబ్ సైట్ ఆ వార్తని తొలగించింది.  అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ సినిమా మరికొద్ది రోజుల్లో ఓటీటీలో రిలీజ్ కానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: