హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిఖిల్, ఆ తర్వాతి కాలంలో మూసధోరణిలో సినిమాలు చేస్తూ ఫేడవుట్ అయ్యే స్థాయి వరకి వెళ్లాడు. కానీ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామిరారా సినిమాతో అతని సెక్ండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయిందని చెప్పవచ్చు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి వినూత్నమైన సబ్జెక్టులని ఎంచుకుంటూ కెరీర్ ని చాలా పద్దతిగా నిర్మించుకున్నాడు.

 

ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా చేస్తున్న నిఖిల్ సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమాలో హీరోగా కనిపిస్తున్నాడు. సుకుమార్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సినిమా చేయడం అంటే నిఖిల్ అదృష్టమనే చెప్పాలి. అర్జున్ సురవరం రిలీజ్ కోసం సంవత్సరాంతం కష్టపడ్డ నిఖిల్ కి ఆ తర్వాత మంచి ఫలితమే వచ్చింది.

 

అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. మొదటగా అనూ ఇమ్మాన్యుయేల్ ని తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న క్రితిశెట్టి అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ సడెన్ గా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తుంది. 

 

ప్రస్తుతం హీరోయిన్ గా సిద్ధి ఇద్నానీ అయితే సరిగ్గా సరిపోతుందని ఫీల్ అవుతున్నారట. సిద్ధి ఇద్నానీ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన జంబలకిడి పంబ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్ 2 లోనూ మెరిసింది. అయితే ఇవేవీ ఆమెకి సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. మరి ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ పుకారు నిజమైతే సిద్ధీ పంట పండినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: