కమెడియన్ వడివేలు కు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కామెడీ టైమింగ్ తో... హావభావాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో  నటించి ఎంతో గుర్తింపును సంపాదించుకున్న వడివేలు... ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఇక వడివేలు కేవలం తమిళంలోనే కాకుండా వివిధ భాషల్లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా... పలు సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వడివేలు. ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుని దూసుకుపోతున్నారు. 

 


 అయితే స్టార్ కమెడియన్ అయిన వడివేలు ప్రస్తుతం మరో ఇద్దరు కమెడియన్స్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. యూట్యూబ్ కార్యక్రమంలో తన పరువు ప్రతిష్టల దిగజార్చే విధంగా... ఎన్నో విమర్శలు చేశారు అంటూ ఆరోపణలు చేసిన  తమిళ స్టార్ కమెడియన్ వడివేలు... మరో ఇద్దరు కమేడియన్స్ అయినా మనో బాల, సింగముత్తు పై.. నడిఘర్  సంఘానికి ఫిర్యాదు చేశారు. నడిగర్ సంఘం లో తాను 30 ఏళ్లకు పైగా సభ్యుడిగా ఉన్నాను అంటూ తెలిపిన హాస్యనటుడు వడివేలు... ఇప్పటివరకు ఎవరి జోలికి వెళ్లకుండా ఎలాంటి వివాదాలు దరిచేరకుండా...  దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. 

 

 ఈ నేపథ్యంలోనే మనోబాల అనే హాస్య నటుడు యూట్యూబ్ వేదికగా వేస్ట్ పేపర్ అనే పేరుతో ఒక టాక్ షో నిర్వహిస్తుండగా... ఈ సందర్భంగా సింగముత్తు అనే హాస్య నటుడు తన గురించి ప్రస్తావించగా తన కీర్తి ప్రతిష్టలు దిగజార్చే విధంగా... కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా... మనోబాల అనే  హాస్యనటుడు పలు విమర్శలు చేశారని ఆరోపించారు స్టార్ కమెడియన్ వడివేలు. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ నడిఘర్  సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక నడిగర్ సంఘం నిబంధనల ప్రకారం తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన ఇద్దరు హీరోయిన్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: