హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ హీరోయిన్ కి మంచి హిట్లు పడితేనే వరుస అవకాశాలు వచ్చి పడతాయి లేదు కెరీర్ ఆరంభంలోనే రెండు మూడు ఫ్లాప్ సినిమాలు పడ్డాయి అంటే ఆ హీరోయిన్ కెరీర్ గాడిలో పడాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే హీరోయిన్లు అన్నప్పుడు కేవలం హిట్లు  ఉన్నప్పుడే వారికి డిమాండ్ ఉంటుంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొస్తుంది ఇక్కడ ఒక ముద్దు గుమ్మ. సాయిధరమ్తేజ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సినిమా రేయ్ . ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటించిన హీరోయిన్ మరాఠీ బ్యూటీ సయామిఖేర్. 2015లో వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయింది. 

 

 ఇక ఈ సినిమా తర్వాత సయామీ బాలీవుడ్ చిత్రం మిర్జ్యా   కు సంతకం చేశారు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమారుడైన హర్షవర్ధన్ కపూర్ ఈ సినిమాలో హీరోగా అరంగేట్రం చేయగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ రెండు ప్రాజెక్టులు ఫ్లాప్ కావడంతో హీరోయిన్ కెరీర్ కి ఎంతో మైనస్ పాయింట్ గా మారిపోయింది. దీంతో తాను చేయాల్సి ఉన్న రెండు సినిమాల నుంచి కూడా హీరోయిన్ ను  తొలగించారు. 

 

 ఈ విషయాన్ని సయామీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మర్జ్యా  సినిమా తర్వాత తను రెండు ప్రాజెక్టులకు సంతకం చేశానని కానీ మర్జ్యా  బాక్సాఫీస్ వద్ద ఆశించినంత వసూళ్లు రాబట్టకపోవడంతో ఆ రెండు ప్రాజెక్టుల నుంచి తనను తీసివేశారు అంటూ చెప్పుకొచ్చారు తన ప్లేస్ లో వేరే వారిని తీసుకున్నారని చెప్పింది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాలో మణిరత్నం సినిమా కూడా ఒకటి ఉంది అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే తన వద్దకు ఎవరైనా స్క్రిప్ట్ వినిపించడానికి వస్తే ఒక ప్రేక్షకురాలు గా మారిపోయి ఆ స్క్రిప్టుని వింటానని.. ప్రేక్షకులకు నచ్చుతుందో లేదా అనే కోణంలో ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: