మంచు హీరో మనోజ్ వెండితెరపై కనిపించి దాదాపు చాలా కాలం అవుతోంది. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ ఆ సినిమా తర్వాత మనోజ్ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే భారీ ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఎం ఎం ఆర్ట్స్ పతాకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్ర కథ విషయానికొస్తే ఈ సినిమాలో మంచు మనోజ్ ‘అఘోర’ పాత్రలో కనిపిస్తాడట. సమాజానికి దూరంగా ఉంటూ శవాలను తింటూ చాలా క్రూరంగా మనోజ్ క్యారెక్టర్ ఉంటుందని ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.

IHG

ఇప్పటికే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు అన్ని పూర్తి కాగా సరిగ్గా షూటింగ్ స్టార్ట్ అవుతుండగా కరోనా వైరస్ రావటంతో ‘అహం బ్రహ్మసి’ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.  ఇక లాక్ డౌన్ సడలింపులతో పాటు సినిమా షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో అహం బ్రహ్మసి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

IHG

ముందుగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మొదలుకానున్న షూటింగ్ ఏకధాటిగా చేసి త్వరగా రిలీజ్ చేయాలని మంచు మనోజ్ ఎక్కడా తగ్గడం లేదు. సినిమాకి సంబంధించి అగోర పాత్రలో రిలీజైన ఫస్ట్ లుక్ తో సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచేశారు. సొంత బ్యానర్ కావటంతో చాలా స్ట్రాంగ్ గా అవుట్ ఫుట్ ఉండాలని… ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని మనోజ్ అనుకుంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: