టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా వారు స్టార్స్ తో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. ఇక్కడ సినిమాలు చేస్తున్న టైం లో హైదరాబాద్ లో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కున్న అమ్మడు ఇక్కడ ఆఫర్లు తగ్గేసరికి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈ అమ్మడు తెలుగులో ఆఫర్లు వస్తున్నా రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవడం లేదని అంటున్నారు. 


ఈమధ్యనే రకుల్ కు ఓ ప్రొడక్షన్ నుండి పులుపు రాగా కోటి, కోటిన్నర ఇస్తేనే కానీ సినిమా చేయనని చెప్పిందట. ప్రస్తుతం తెలుగులో వెనుకపడ్డ రకుల్ కు అంత డిమాండ్ లేకపోయినా సరే తను మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకునేది లేదని అంటుందట. ఇలానే వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకుంటే ఇక ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా రావడం కుదరదు. స్పైడర్ ప్లాప్ తర్వాత అతి కష్టం  మీద మన్మధుడు 2 సినిమాలో ఛాన్స్ పట్టేసిన రకుల్సినిమా డిజాస్టర్ అవడంతో తెలుగులో ఆమెకు ఛాన్సులు తగ్గాయి. 


ఎలాగోలా వచ్చిన ఆఫర్ ను చేసే ఆలోచనలో ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదని అంటున్నారు. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రకుల్ కు ఆఫర్లు తగ్గాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రకుల్. ఆఫర్లు  అమ్మడు మాత్రం రెమ్యునరేషన్ తగ్గించడం లేదని తెలుస్తుంది. నితిన్ హిట్టయితే మళ్ళీ తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది రకుల్. అమ్మడు సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతుంది రకుల్                              

 

మరింత సమాచారం తెలుసుకోండి: