సందీప్ వంగా మళ్లీ టాలీవుడ్ లోకి వస్తున్నాడు. కబీర్ సింగ్ తర్వాత వచ్చిన వేవ్ తో ముంబయిలోనే ఉండిపోతాడనుకున్న సందీప్ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ మెగామూవీతో తెలుగునాట మళ్లీ హడావిడి చేసేందుకు వస్తున్నాడు సందీప్ వంగ. 

 

అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ వంగా.. కబీర్ సింగ్ తో బాలీవుడ్ కు వెళ్లాడు. ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. షాహిద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ హిట్ తో టీ-సిరీస్ వాళ్లు సందీప్ తో మరో మూవీ అనౌన్స్ చేశారు. డెవిల్ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. 

 

డెవిల్ సినిమాకు బాలీవుడ్ హార్ట్ త్రోబ్ రణ్ బీర్ కపూర్ సైన్ చేశాడని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ తర్వాత రణ్ బీర్ డెవిల్ గా మారడానికి ఇష్టపడటం లేదనీ.. ప్రభాస్ ను కాంటాక్ట్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. బాహుబలి పాన్ ఇండియన్ ఇమేజ్ డెవిల్ కు ప్లస్ అవుతుందని లెక్కలు కూడా కట్టారు ట్రేడ్ పండిట్స్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ క్లారిటీ రాకముందే.. సందీప్ వంగా అల్లు హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

 

సందీప్ వంగా తర్వాత అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. బన్నీకి సందీప్ ఓ స్టోరీ నెరేట్ చేశాడని త్వరలోనే వీళ్ల కాంబినేషన్ లో సినిమా రాబోతోందని చెబుతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్పతో బాలీవుడ్ ని టార్గెట్ చేశాడు. సో వీళ్ల కాంబినేషన్ లో పాన్ ఇండియన్ సినిమానే వస్తుందని చెప్పొచ్చు. 

 

మొత్తానికి సందీప్ వంగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. కబీర్ సింగ్ క్రేజ్ ను కొనసాగిస్తూనే తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇక్కడ మెగా మూవీతో ఆయన ఎలా మేజిక్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: