లాక్ డౌన్ సమయంలో నిర్మాతలు పడుతున్న బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా మంది నిర్మాతలు ఇప్పుడు అప్పులు చేసి వాటి నుంచి ఏ విధంగా బయటకు రావాలో అర్ధం కాకా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న నిర్మాతలు కూడా నరకం చూస్తున్నారు. అగ్ర నిర్మాతలు అయితే భారీగా అడ్వాన్స్ లు ఇచ్చేసి సినిమాలు చెయ్యడం ఏ విధంగానో అర్ధం కాక నరకం చూసే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం పవన్ కళ్యాణ్ తో పాటుగా కొందరు హీరోలకు ముందే డబ్బులు ఇచ్చారు నిర్మాతలు. 

 

ప్రభాస్ కి అయితే దాదాపు 20 కోట్ల వరకు ఇచ్చిన నిర్మాతలు కూడా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు వారికి ఉన్న డిమాండ్ ని అర్ధం చేసుకుని ఇచ్చారు అని అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోలు తీసుకున్న పారితోషికం తిరిగి ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ముందు పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న డబ్బులను నిర్మాతలకు తిరిగి ఇచ్చేసే ఆలొచనలో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన ఇప్పటికే నిర్మాతలతో ఈ విషయం గురించి మాట్లాడారు అని సమాచారం. 

 

తనకు ఏ ఇబ్బంది లేదని తాను తిరిగి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా అని ఆయన చెప్పారని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే నిర్మాతల బాధలను అర్ధం చేసుకున్న చిరంజీవి తిరిగి ఇవ్వాలి అని మెగా హీరోలు అందరికి సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే చేస్తున్నారు అని సమాచారం. రామ్ చరణ్ కూడా ఒక నిర్మాత దగ్గర తీసుకున్నారు అని ఆయన కూడా ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: