మెగా హీరో వరుణ్ తేజ్ ఖాతాలో మరో బ్రాండ్ వచ్చిచేరింది. ఇంతకుముందు ఆర్ ఎస్ బ్రదర్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించిన వరుణ్ తాజాగా నాగార్జున సిమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఈమేరకు నాగార్జున సిమెంట్ పేరెంట్ కంపెనీ ఎన్ సి ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వరుణ్ తేజ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా అందుకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదలచేసింది. త్వరలోనే నాగార్జున సిమెంట్, టివిసి యాడ్ లో వరుణ్ మెరవనున్నాడు. 
ఇక గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో వరుణ్ తేజ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం వరుణ్,బాక్సర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం ఇటీవలే వైజాగ్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్, బాక్సర్ గా కనిపించనుండగా అతనికి జోడిగా లావణ్య త్రిపాఠి నటించనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ,పెద్ద కుమారుడు అల్లు బాబీ, సిద్దు ముద్దా తో కలిసి 30కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్నినిర్మిస్తుండగా థమన్ సంగీతం అందించనున్నాడు. ఈఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: