అల్లు కాంపౌండ్ బ్యాకింగ్ ఉండి కూడ శిరీష్ హీరోగా పెద్దగా రాణించ లేకపోయాడు. జాతకాలు న్యూమరాలజీ పై బాగా నమ్మకం ఉన్న శిరీష్ తాను విన్న కథ ఒక సినిమాగా పనికి వస్తుందా లేదా అని చెప్పే విషయంలో చాల దిట్ట అని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు.


అలాంటి శిరీష్ తన కెరియర్ లో ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి మంచి హిట్ ను ఇచ్చిన పరుశు రామ్ చెప్పిన రెండు కథలను వదులుకున్నాడు అంటూ ఇప్పుడు ఆలస్యంగా ఒక గాసిప్ వెలుగులోకి వచ్చింది. ఒకప్పటి ఈ వార్త ఇప్పుడు వెలుగులోకి రావడానికి కారణం మహేష్ పరుశు రామ్మూవీ ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ అని అంటున్నారు.


వాస్తవానికి ఈమూవీ కథ పరుశు రామ్ మహేష్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాయకుండా చాల కాలం క్రితం శిరీష్ కోసం తయారుచేసిన కథ అని తెలుస్తోంది. అయితే ఈ కథ శిరీష్ కు నచ్చకపోవడంతో ఈ కథ సినిమాగా మారలేదు. కానీ మహేష్ కు పరుశు రామ్ చెప్పిన రెండు మూడు కథలలో గతంలో శిరీష్ కు చెప్పిన కథను కూడ ఇరికించాడని టాక్. ఆ కథ అనుకోకుండా మహేష్ కు నచ్చడం అదే కథ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రాజెక్ట్ గా మారింది అని అంటున్నారు.

గతంలో ఇలాగే పరుశు రామ్ ‘గీత గోవిందం’ కథను అల్లు శిరీష్ కు వినిపిస్తే ఆకథ సినిమాగా బాగుండదు అని శిరీష్ రిజక్ట్ చేసాడు అని అంటారు. మళ్ళీ అదే కథ విజయ్ దేవరకొండతో తీస్తే అది బ్లాక్ బష్టర్ హిట్ గా మారడంతో శిరీష్ తాను తప్పు చేసానా అని అప్పట్లో ఫీల్ అయ్యాడు అని అంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ శిరీష్ రిజక్ట్ చసిన కథ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ గా మారడమే కాకుండా ఆ సినిమా ఫస్ట్ లుక్ కు లక్షల సంఖ్యలో లైక్ వచ్చిన పరిస్థితులలో శిరీష్ మళ్ళీ తప్పు చేసాడ అంటూ జాతకాలు తెలిసిన ఈ అల్లు వారి అబ్బాయి కథల జాతకాలను పసికట్టలేకపోతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: