వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న శర్వానంద్ శ్రీకారం సినిమాపై మంచి నమ్మకం పెట్టుకున్నాడు. పడి పడి లేచే మనసు సినిమా నుండి రణరంగం, జాను సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వెంటాడుతున్న వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శర్వానంద్ మరో కొత్త సినిమా ఒప్పుకున్నాడని టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు.

 

శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి హిట్ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా ప్రారంభం కానుంది. శ్రీరామ్ రెడ్డి అనే నూతన దర్శకుడు చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన యూవీ బ్యానర్ శర్వాతో సినిమా తీయడానికి రెడీ అయ్యింది. అయితే ఈ కథని శ్రీరామ్ రెడ్డి ఇంతకుముందు మెగా హీరోలకి వినిపించాడట. వారందరూ ఈ కథని రిజెక్ట్ చేసారట.

 

ముందుగా రామ్ చరణ్ కి వినిపిస్తే రిజెక్ట్ చేసాడట. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకి కూడా వినిపించాడట. అయితే వారందరూ రిజెక్ట్ చేసిన తర్వాత యూవీ బ్యానర్ కి వినిపించాడట. కథ బాగా నచ్చిన నిర్మాతలు శర్వానంద్ తో చేద్దామని రెడీ అయ్యారట. శర్వాకి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చిందని టాక్. అందుకే కొత్త దర్శకుడైనా ఓకే చేసాడట. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు సాధారణంగా ప్రతీ ఒక్కరికీ జరిగేవే.

 

ఒకరు రిజెక్ట్ చేసిన కథని మరొకరు చేయడం మామూలే. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన కథలన్నీ ఎవరో ఒకరు రిజెక్ట్ చేసినవే అయి ఉంటాయి. అయితే అలా రిజెక్ట్ చేయడానికి కథ నచ్చకపోవడం ఒక్కటే కారణమని చెప్పలేం. కొన్ని కథల్ని కొందరు మాత్రమే చేయగలరు. స్టార్ హీరో కథలు వేరేగా ఉంటాయి. అలాగే మీడియం రేంజ్ హీరోల కథలు వేరేగా ఉంటాయి. సో శర్వా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: